Thursday, December 9, 2010

పెళ్లకాని ప్రసాదులు * యువతీ యువలకులకు తలంబ్రాలు తలమీద పోయించుకోవడానికి అడ్డువస్తోన్న కారణాలెన్నో ....

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని పెద్దలు చెబుతుంటారు. ఆ ముచ్చట్లో పెళ్లి కూడా ఒకటి. అయితే ఈ మధ్య యువకులు వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కళ్యాణపీట మీద కూర్చోవడం ఆలస్య మవుతుండడంతో పెళ్లికాని ప్రసాదులుగా పేరు తెచ్చుకుంటున్నారు. కెరీర్‌కు అధికంగా ప్రాధాన్యతనిస్తూ తమ లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమం లో పెళ్లికాని ప్రసాదుల వయస్సు మూడు పదులకు చేరుకోవడం, దాటడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యువతీ యువలకులకు తలంబ్రాలు తలమీద పోయించుకోవడానికి అడ్డువస్తోన్న కారణాలెన్నో ఉన్నాయి...

marriageప్రతి ఏడాది రెండు, మూడు పెళ్లిళ్ల సీజన్‌లు ఉంటాయి.అనుకూలంగా ఉండే పెళ్లి ముహూర్తాలను పెట్టుకొని వివిధ సమయాల్లో యువతీ యువకులు పెళ్లిచేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్‌ నగరంలోని యువతీ యువకులు తమ కెరీర్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతే పెళ్లిచేసుకోవాలని వారు భావిస్తూ తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఆర్థిక మాంద్యం కారణం వల్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే కాదు, కుదేలయిన అనేక రంగాల వల్ల నగర యువత కొంతమంది పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు.దీంతో వారి వయస్సు 30కు చేరుకోవడంతో పాటు కొన్నిసార్లు ఆ వయస్సు కూడా దాటి పోతోంది.

నగరాల్లోనే...
ప్రధానంగా నగరాల్లోని తల్లిదండ్రులు పిల్లల చదువుపెైనే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు అనుకున్నవారు పిల్లలకు కళ్యాణం చేస్తున్నారు. తరువాత వారి చదువుని కొనసాగిస్తున్నారు.మరికొంత మంది ఉద్యోగం వచ్చే వరకు ఎదురుచూస్తున్నారు. అలా అబ్బాయిలకు దశాబ్దంన్నర క్రితం 21 సంవత్సరాలకే పెళ్లి చేసేవారు. అప్పుడు అబ్బాయిలకు 25 దాటగానే పెళ్లికాని ప్రసాద్‌లని పిలిచేవారు. అయిదు,ఆరు సంవత్సరాల నుంచి ఆ వయసు క్రమేణా పెరుగుతోంది. ఇప్పుడు 26, 27 ఏళ్లు వచ్చి నా ఏమంత వయసు వచ్చింది అని సమర్ధించుకునేవారు ఎక్కువెై పోతున్నారు.ఉద్యోగం రేపో మాపో వచ్చేస్తోంది. ఉద్యోగం రాగానే తలంబ్రాల కార్యక్రమమే అని సమాధానమిస్తున్నారు.

నౌకరి సంపాదించిన తరువాతనే పెళ్లి చేసుకోవడానికి యువత ఆసిక్తి చూపిస్తున్నారు. అలా ఎదురు చూస్తు 30 ఏళ్లు దాటిపోయినవారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. పెరిగిన పోటీ, సవాళ్లతో యువత పోరాడుతోం ది. ఉద్యోగం సంపాదించినా కొంతమంది పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే వచ్చేది తక్కువ జీతం, అది నా అవసరాలకే సరిపోవడం లేదు. ఇంకా వచ్చే భార్యని ఎలా పోషించను అని అం టున్నారు. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒత్తిడి తెస్తున్నా తప్పించుకుంటున్నారు.వేతనాలు పెరిగిన వెంటనే ఇంటి వాడినవడానికి సిద్ధమని హామీ ఇస్తున్నారు.

యువకుల అభిప్రాయాలు... :
ఇప్పుడే ఉద్యోగం వచ్చింది ఈ నాలుగురోజులెైనా బిందాస్‌గా గడపనీ అని చెప్పేవారు ఒకరెైతే, నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదని మరొకరు, ఉద్యోగంచేసే అమ్మాయి ఉండాలని కోరుకునే యువకులు నేడు ఎందరినో చూడవచ్చు.

అమ్మాయిలదీ అదే వరుస... :
BRIDGEతమ కాళ్లఫై నిలబడాలని అమ్మాయిల్లో పట్టుదల ఎక్కువగా కనిపిస్తోంది. కాబోయే భర్త తెచ్చే జీతం మీద ఆధారపడేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది.అబ్బాయిలకు సరిసమానంగా నేడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరి కి అబ్బాయిల కంటే పెళ్లిచేసుకోమని ఇంట్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది.అయినా తల్లిదండ్రులకు నచ్చచెప్పినచ్చి న ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. భార్యభర్తలిద్దరూ ఉద్యోగులెైతే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్నారు.వివాహం ఆలస్యమైనా జీవితంలో స్థిరపడడానికే ప్రాముఖ్యతనిస్తున్నారు.

పల్లెల్లో... :
ఉద్యోగాలఫై ఆధారపడని, కార్మికులుగా, కూలిపనిగా చేసే గ్రామీణ కుటుంబాల్లో ఇది వరకు అబ్బాయిలకు పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి చేసేవారు. దాన్ని పెద్ద తప్పుగా భావించేవారు కాదు. గ్రామాల్లో అబ్బాయి లు ప్రస్తుత సమాజంపెై అవగాహన ఏర్పరుచుకుంటున్నా రు. 25 ఏళ్లు కూడా లేవు నాకింతలోకే పెళ్లి ఎందుకని తల్లిదండ్రులను అడుగుతున్నారు. పెద్దలు ఇతర కుటుం బ సభ్యుల ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకోవాల్సి వస్తోందని యువకులు వాపోతున్నారు. పల్లెల్లో చెల్లెలికి, అక్కకి పెళ్లి కాలేదని వయసు పెరిగిపోయే వారు ఎక్కువగా కనిపిస్తారు.

పల్లెపడుచులు... :
పల్లెల్లో అబ్బాయిగాని, అమ్మాయి పుట్టగానే వారికి జోడిని కుదుర్చుకోవడం ఆచారం. రక్తసంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలకు వయసు రాగానే కళ్యాణం కానిచ్చేవారు. ఇలా అనేకచోట్ల జరుగడం తెలిసిందే. క్రమంగా పల్లెటూర్లలో కూడా మా ర్పు వస్తోంది. ఆడపిల్లకి పెళ్లి అయ్యేవరకు చదివిస్తున్నారు.అంటే వీరి ఉద్దేశ్యం పదవ తరగతి వరకు. పదవ క్లాసుకు ముందు కూడా మంచి వరుడు దొరకగానే పెళ్లి చేసేస్తున్నారు. ఎక్కువ ఆస్తి ఉన్నవారు, తక్కువ కట్నం అడిగేవారు వస్తే అమ్మాయిలకు16 ఏళ్లు దాటకపోయినా మూడు ముళ్లు వేయించేస్తున్నారు.

మార్పు సహజం... :
యువతలో కాలనుగుణంగా చైతన్యం  వచ్చింది. సాదాసీదాగా బతికేయాలని అనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఏ రంగమైనా తమకంటూ గుర్తింపు రావాలని యువతీ యువకులు తపిస్తున్నారు. దాంతో పోటీ పెరగడంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి కొంత సమయం పడుతుందని ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలో పడి వయసు గురించి పట్టించుకోకపోతే సంతాన సాఫల్య సమస్యలను ఎదుర్కోవలిసి ఉంటుందని వెైద్యులు తెలియచేస్తున్నారు. లక్ష్యంపెై స్పష్టత, ఆత్మవిశ్వాసం తోడుంటే మూడు పదుల వయసు వరకూ వేచి చూడకుండా విజయాలను సొంతం చేసుకోవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

1 comment:

Unknown said...

అబ్బాయిల సంగతి నాకు తెలీదు కాని, అమ్మాయిలు మాత్రం చాల మంది తల్లిదండ్రుల కోసం సర్దుకు పోతున్నారు. మా తరం వారు ఆ సర్దుకు పోయే ప్రయత్నం చెయ్యట్లేదు అంతే. నా వరకు చెప్తున్నా "కార్యేషు దాసీ, కరణేషు మంత్రి... " అని అబ్బాయిలు ఎలా అయితే కలలు కంటారో, అలాగే అమ్మాయిలు కూడా మగ వాళ్ళల్లో "కార్యేషు దాసీ..." టైప్ అబ్బాయిల కోసం ఎదురు చూస్తున్నారేమో? అలా ఎందుకు అనుకోకూడదు?